Enriching your journey through a blog opens doors to endless knowledge, growth, and inspiration, making every step more fulfilling Grow With Us Explore the Blog!

advt

ఓటు హక్కు - ప్రజాస్వామ్యానికి పునాది: కె.వి.ఆర్ కళాశాల విద్యార్థినుల ఓటర్ల ప్రతిజ్ఞ

18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకులు బాధ్యతగా ఓటరుగా నమోదు చేసుకోవాలి. కులమతాలకు, ప్రలోభాలకు లొంగకుండా సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారానే ప్రజాస్వామ్య




 క్లస్టర్ యూనివర్సిటీ, కె వి ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజనీతి శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా డి రవికుమార్ తహసీల్దార్ మరియు అసిస్టెంట్ ఎలెక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి, శ్రీ ధనుంజయ డిప్యూటీ తహసీల్దార్ హాజరయ్యారు.
డి రవికుమార్ తహసీల్దార్ మరియు అసిస్టెంట్ ఎలెక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి మాట్లాడుతూ యువత చైతన్యవంతులై ఉండాలని, 16 వ ఓటర్ల దినోత్సవ థీమ్ మై ఇండియా మై ఓట్ అనే అంశంపై అవగాహన కల్పించారు.
ధనుంజయ మాట్లాడుతూ ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు ప్రాధాన్యతను, ఫారం 6 గురించి వివరిస్తూ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతిభగల విద్యార్థులకు బహుమతులు అందిస్తున్నట్లు తెలియజేశారు.
డాక్టర్ కె. వెంకట రెడ్డి విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకులు బాధ్యతగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థినులు వెంటనే ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఓటుకు ఉందని, కులమతాలకు, ప్రలోభాలకు లొంగకుండా సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని విద్యార్థుల్లో చైతన్యం నింపారు.
అనంతరం కళాశాల సిబ్బంది మరియు విద్యార్థినులు కలిసి "నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేస్తామని" ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డా యం సి సాహిత్య, బి ఎల్ వో లు, వివిధ విభాగాల అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
కె.వి.ఆర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం | Telugu News

తెలుగు వార్తలు (Telugu News)

జనవరి 24, 2026

కె.వి.ఆర్ కళాశాలలో 'జాతీయ ఓటర్ల దినోత్సవం' పై అవగాహన సదస్సు

విషయ సూచిక (Table of Contents)

    క్లస్టర్ యూనివర్సిటీ, కె వి ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజనీతి శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు.

    ముఖ్య అతిథుల ప్రసంగం

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి రవికుమార్ (తహసీల్దార్ మరియు అసిస్టెంట్ ఎలెక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి), మరియు శ్రీ ధనుంజయ (డిప్యూటీ తహసీల్దార్) హాజరయ్యారు.

    డి రవికుమార్ మాట్లాడుతూ యువత చైతన్యవంతులై ఉండాలని, 16 వ ఓటర్ల దినోత్సవ థీమ్ "మై ఇండియా మై ఓట్" అనే అంశంపై అవగాహన కల్పించారు.

    విద్యార్థులకు పోటీలు - ప్రోత్సాహకాలు

    ధనుంజయ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు ప్రాధాన్యతను, ఫారం 6 గురించి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తున్నట్లు ప్రకటించారు.

    ప్రిన్సిపాల్ సూచనలు

    "18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకులు బాధ్యతగా ఓటరుగా నమోదు చేసుకోవాలి. కులమతాలకు, ప్రలోభాలకు లొంగకుండా సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది." - డాక్టర్ కె. వెంకట రెడ్డి

    ముఖ్యంగా కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థినులు వెంటనే ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

    ఓటర్ల ప్రతిజ్ఞ

    అనంతరం కళాశాల సిబ్బంది మరియు విద్యార్థినులు కలిసి "నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేస్తామని" ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డా యం సి సాహిత్య, బి ఎల్ వో లు, వివిధ విభాగాల అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

    © 2026 కె.వి.ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల వార్తలు.

    Post a Comment

    For suggestions / doubts / complaints