Enriching your journey through a blog opens doors to endless knowledge, growth, and inspiration, making every step more fulfilling Grow With Us Explore the Blog!

advt

సామాజిక సాధికారత దినోత్సవంగా 'దామోదరం సంజీవయ్య' ప్రమాణ స్వీకార దినం: కర్నూలు మేధావుల వేదిక తీర్మానం

దామోదరం సంజీవయ్య గారు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు. ఆయన పేరిట ఉన్న కొన్ని అరుదైన ఘనతలు:
 భారత రాజకీయ యవనికపై నిజాయితీకి, నిరాడంబరత్వానికి నిలువెత్తు రూపం శ్రీ దామోదరం సంజీవయ్య గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 11ను లేదా ఆయన జన్మదినమైన ఫిబ్రవరి 14ను “సామాజిక సాధికారత దినోత్సవం” గా జరుపుకోవాలని కర్నూలు జిల్లా మేధావుల వేదిక ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఈ మేరకు కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ కె. చంద్రశేఖర కల్కుర, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఎ. వెంకటస్వామి, ఆచార్య ఎస్. మాన్సూర్ రెహమాన్, మరియు ఎం. శ్రీహర్ష గార్ల ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించబడింది.

అరుదైన రికార్డులు.. అద్వితీయ నాయకత్వం

దామోదరం సంజీవయ్య గారు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు. ఆయన పేరిట ఉన్న కొన్ని అరుదైన ఘనతలు:
తొలి దళిత ముఖ్యమంత్రి: భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొదటి దళిత నాయకుడు.
అతి పిన్న వయస్కుడు: కేవలం 38 ఏళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రికార్డు ఆయనది.
ద్విపాత్రాభినయం: అటు ముఖ్యమంత్రిగా, ఇటు ఏఐసీసీ (AICC) అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు సేవలందించిన మేధావి.
పాలనలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు
సంజీవయ్య గారి స్వల్ప కాల పాలనలో రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు పడ్డాయి:
అవినీతి నిర్మూలన: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టడానికి  అవినీతి నిరోధక శాఖ (ACB) ను ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక & విద్య: రవీంద్ర భారతి, లలిత కళల అకాడమీ మరియు సరోజినిదేవి కంటి ఆసుపత్రిని నెలకొల్పారు.

సంక్షేమ పథకాలు: వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా అప్పట్లో పెన్షన్ సౌకర్యం లేని ఉపాధ్యాయులకు పింఛను సౌకర్యాన్ని కల్పించిన ఘనత ఆయనదే.

నీటి పారుదల: గాజులదిన్నె, వరదరాజుల స్వామి ప్రాజెక్టు (కర్నూలు), వంశధార (శ్రీకాకుళం), మరియు పులిచింతల (గుంటూరు) వంటి ప్రాజెక్టుల పురోగతిలో ఆయన పాత్ర కీలకం.
"సంజీవయ్య గారి జీవిత ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం. అణగారిన వర్గాల సాధికారత కోసం, కార్మిక సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం." - సమావేశంలోని వక్తలు
రాజకీయ ప్రస్థానం - మైలురాళ్లు


1952లో ఎమ్మెల్యేగా గెలిచి రాజాజీ కేబినెట్‌లో చేరి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి , ప్రకాశం పంతులు కేబినెట్‌లోను, రెండవ ముఖ్యమంత్రి, బెజవాడ గోపాలరెడ్డి కేబినెట్‌లోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలోను ప్రతిభావంతముగా బాధ్యతలు నిర్వహించినారు. ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో పని చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో రెండు పర్యాయాలు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ఘనత వీరిదని వారు కొనియాడారు.



పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో విశ్రాంత రాజనీతి శాస్త్ర అధ్యాపకులు శ్రీ సి. రమేష్, విశ్రాంత చరిత్ర అధ్యాపకులు శ్రీ బి. ఇమ్మానుయేల్, విశ్రాంత డిఎస్పీ శ్రీ పాపారావు, విశ్రాంత బి.ఎస్.ఎన్.ఎల్ అధికారి ఎం. యాకోబ్, అధ్యాపకులు జి. ఐసయ్య, జర్నలిస్ట్ మధు తదితరులు పాల్గొని సంజీవయ్య గారి
 సేవలను కొనియాడారు.

Post a Comment

For suggestions / doubts / complaints